కిడ్నీ బాధితుడికి జనసేన నాయకులు పరామర్శ

  • కిడ్నీ బాధితుడికి ప్రభుత్వం ఆదుకోవాలి
  • జనసేన నాయకులు సాయిబాబా దురియా, రామకృష్ణ, రాజా భరత్

కిడ్నీ బాధితుడు మజ్జి అర్జున్ కి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు మాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా, అల్లంగీ రామకృష్ణ, కిలో రాజ్ భరత్, గతం లక్ష్మణరావు పుంకురు రౌతు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. శనివారం ఉదయం జనసేన పార్టీ బృందంగా ఏర్పడి అరకు నియోజకవర్గ కేంద్రం జడ్పీ కాలనీలో కిడ్నీ బాధితులు మజ్జి అర్జున్ ఇంటి వద్దకు వెళ్లి ముందు గా పరమర్శించి.. జనసేన ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబీకులు పాల్గొన్నారు.