యాడికి పట్టణంలో బాబు స్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ
- సైకిల్ గుర్తుకే మన ఓటు
- యాడికి పట్టణం, కోటవీధిలో పర్యటించిన జెసి
బాబు స్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం యాడికి పట్టణం, కోటవీధిలో తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ జెసి అష్మిత్ రెడ్డి పర్యటించి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జెసి అష్మిత్ రెడ్డి వెంట తాడిపత్రి నియోజకవర్గ జనసేన సమన్వయ కర్త కదిరి శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో యాడికి మండల టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, జెసి అనుచరులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.