ఓటమి భయంతోనే పవన్ పై దుష్ప్రచారం

  • కౌలు రైతులను ఆదుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్
  • జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

రాజంపేట: ఓటమి భయంతోనే వైసిపి నాయకులు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై దుష్ప్రచారం చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ నిర్వహించే వారాహి యాత్ర అవనిగడ్డ పెడన సభలు విజయవంతం అయ్యాయని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. శనివారం సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనసున్న వ్యక్తి కాబట్టే కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుంటున్నారన్నారు. గోతులు పడ్డ రోడ్లకు మరమ్మత్తులు చేయాలని రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని, నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించాలని, ఇలా అనేక అంశాల పైన పోరాటం చేసిన వ్యక్తి కనుకే రాష్ట్ర ప్రజలందరూ, పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారన్నారు.అది చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. టిడిపి పొత్తు ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ వారాహ యాత్ర విజయవంతమైందని రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిందన్నారు.