కొత్తపల్లి మండలంలో టిడిపి, జనసేనల నిరసన దీక్ష

నందికొట్కూరు: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ శనివారం కొత్తపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో జనసేన శ్రేణులు కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగినది. ఈ దీక్షకు తెలుగుదేశం పార్టీ లింగ స్వామి గౌడ్, ఇక్బాల్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నుండి ప్రవీణ్ కుమార్ పాల్గొని విజయవంతంగా దీక్షను పూర్తి చేశారు. ఈ దీక్ష శిబిరంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు గారిని అరెస్టు చేయడం దారుణమని, ప్రపంచంలో నలుమూలల ధర్మాల రూపంలో, ఉద్యమ రూపంలో వారి యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నారని, వైసీపీ అధికారంలో వచ్చాక ప్రజా వేదిక కుల్చినప్పటి నుంచి ప్రజా ధనాన్ని వృధా చేశారని, ఈ వైసీపీ సైకోని అధికారం నుండి గద్దె దించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అవసరమని కొనియాడారు. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. తిరిగి మళ్లీ అధికారాన్ని దక్కించుకోవాలని సైకో ముఖ్యమంత్రి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని మీ వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో లేరని తెలియజేయడం జరిగింది.