పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

  • బద్రి నాయుడును పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: కాట్రేనికోన మండలం, గెద్దనపల్లి గ్రామానికి చెందిన బద్రి నాయుడు ఇటీవల 24 గంటల కడుపునొప్పితో ఆపరేషన్ చేయించుకుని ఇంటిదగ్గర కోలుకుంటున్నారు. సోమవారం జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ బద్రి నాయుడును పరామర్శించి, వారి ఆరోగ్యం పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. వీరివెంట కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాలప్రసాద్, సంసాని పాండురంగారావు, పితాని రాజు, గొలకోటి పణి, బొక్కా శ్రీను, నల్లా వాసు, అరిగెల చిన్ని, చీకట్ల వీరబాబు మొదలగు వారు ఉన్నారు.

  • కాట్రేనికోన మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

కాట్రేనికోన మండలం, పల్లంకుర్రు గ్రామానికి చెందిన జనసేన నాయకులు అమరా సాయి తాతయ్య అమరా గోవిందరాజులు ఇటీవల మరణించారు. వారి కుటుంబసభ్యులను కాట్రేనికోన గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన ఆశపు రాజేశ్వరి కుమారుడు శ్రీనును జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించారు. వీరివెంట కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాలప్రసాద్, సంసాని పాండురంగారావు, సలాది హరిబాబు, సలాది శ్రీరామ్, విళ్ల శివ, సిరివిశెట్టి అజయ్, బళ్ళ కుమార్, పితాని రాజు, మాగాపు మల్లేష్, మాగాపు పట్టాభి, బొక్కా శ్రీను, కాలాడి రాజు, పెమ్మాడి శ్రీను, ఒలేటి శ్రీను, కొటికలపూడి సురేంద్ర మొదలగువారు ఉన్నారు.