నేతాజీ 127వ జయంతి వేడుకలు

విజయవాడ సెంట్రల్: జనసేన పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ అధ్యక్షులు దాసరి నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి కార్యక్రమంలో పాల్గొని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మిశెట్టి వాసు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త. జనసేన నాయకులు, సెంట్రల్ నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు, నగర కమిటీ సభ్యులు, ధార్మిక మండలి సభ్యులు, అధికార ప్రతినిధులు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.