పలు కుటుంబాలను పరమర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్న ముమ్మిడివరం మండలం, చెయ్యోరు గున్నేపల్లి గ్రామానికి చెందిన జనసేన నాయకులు గోలకోటి సాయిబాబా ని పరామర్శించారు. మరియు అనారోగ్యంతో బాధపడుతున్న ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామానికి చెందిన జనసేన నాయకులు సలాది రాజా తండ్రిని పరమర్శించారు. మరియు పితృవియోగంతో బాధపడుతున్న ముమ్మిడివరం మండలం ఠానేలంక గ్రామానికి చెందిన యలమంచిలి శ్రీనుని పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సానబోయిన మల్లికార్జునరావు, గోదశి పుండరీష్, జక్కంశెట్టి పండు, గొలకోటి వెంకన్నబాబు, మద్దిశెట్టిపురుషోత్తం, లంకలపల్లి జమ్మి, దూడల స్వామి, మాదాల శ్రీధర్, కోన సోము, విత్తనాల అర్జున్, గంజా యేసు, వాసంసెట్టి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.