జొన్నాడ అగ్ని బాధిత కుటుంబానికి బండారు శ్రీనివాస్ ఆర్థిక సాయం

  • ఆపదలలో ఉన్నవారికి అండగా ఆపన్న హస్తం అందిస్తూ కష్ట నష్టాల్లో వున్నవారికి ధైర్యంనిస్తున్న బండారు

కొత్తపేట: అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు మండలం, జొన్నాడ గ్రామంలో కుంతీదేవి ఆలయ సమీపంలో ఆదివారం ఉదయం తెల్లవారుజామున మోరంపుడి సాయి దంపతులు నివసిస్తున్న పురిగుడిసీ అగ్ని ప్రమాదం గురై నిరాశ్రయులైన విషయం తెలుసుకున్న కొత్తపేట నియోజక వర్గం జనసేన ఇంఛార్జి బండారు శ్రీనివాస్ స్పందించి విచారం వ్యక్తం చేస్తూ.. సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ పరిస్థితుల వల్ల కటిక పేదరికంతో ఉన్న బాధితులకు తన వంతుగా ఆర్థిక సహాయం 5000/- రూపాయిలు, జొన్నాడ జనసేన కార్యకర్తలు సాయి దంపతులను పరామర్శించి రైస్ బ్యాగ్ లు, నిత్యావసర సరుకులు అందించటం జరిగింది. ఈ సందర్భంగా కొత్తపేట నియోజక వర్గం జనసేన ఇంఛార్జి మాట్లాడుతూ జనసేన కుటుంబం అంతా అండగ ఉంటుంది అని, ఆపద సమయాల్లో తన జనసేన కుటుంబం తమ సొంత మనుషులు ఆపదలలో ఉన్నట్లు స్పందించి అవసరం అయిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధం అని, తాను అధికారులతో మాట్లాడి రావలసిన సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జోన్నడ జనసేన పార్టీ ప్రెసిడెంట్ చింతలపూడి శ్రీనువాసు, చెల్లే ప్రేమ్ కుమార్, మహదశా బాబులు, భావన శివ శంకర్, మల్లేశ్వరరావు, పాము కాటన్ రాజు, జొన్నాడ శ్రీను వాసు, జొన్నాడ రాంబాబు, వడ్డె మణికంఠ, ఏలూరి పనింద్ర, నాగిరెడ్డి మహేష్, జనసైనికులు పాల్గోన్నారు.