జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ కు ఘన నివాళులు

హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదారాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణా జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, పోలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, కోట రుక్మిణి, హైదరాబాద్ ఎల్ బి నగర్ నియోజకవర్గం నాయకులు వెంకట సాయి ప్రసాద్ కోటిపల్లి, వీరమహిళలు, జనసేన నాయకులు మరియు జనసైనికులు కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.