మూడో రోజుకు చేరిన బండి సంజయ్ పాదయాత్ర..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. పాదయాత్రను చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద ప్రారంభించిన సంజయ్… రెండో రోజున గోల్కొండ కోట దగ్గర బహిరంగసభను నిర్వహించారు. 2023 ఎన్నికల్లో గోల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగురవేస్తామని ఈ సందర్భంగా ఆయన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఈనాటి పాదయాత్ర తిప్పుఖాన్ బ్రిడ్జి, లంగర్ హౌస్ మీదుగా ఆరే మైసమ్మ గుడి వద్దకు చేరుకుంటుంది. అక్కడ సభను నిర్వహించిన తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత అజీజ్ నగర్ మీదుగా హిమాయత్ నగర్ వరకు సాగుతుంది. రాత్రి బండి సంజయ్ హిమాయత్ నగర్ లో బస చేస్తారు. రాత్రి 9.30 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఈరోజు మొత్తం 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది.