కన్నా ఆశ్రమంలో బత్తుల దంపతులు

రాజనగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కాపవరం గ్రామానికి చెందిన కొండేటి ప్రశాంత్ కుమార్ వారి సతీమణి కొండేటి గీతా మౌనిక దంపతులు కన్నా ఆశ్రమం ఫౌండేషన్ కి సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల దంపతులను హాజరయ్యారు. అనంతరం మానసిక వికలాంగులకు మనోధైర్యం చెప్పి భోజనం తినిపించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.