84వ రోజుకు చేరిన పవనన్న ప్రజాబాట

  • డాక్టర్ కందుల ఆధ్వర్యంలో విజయవంతంగా సాగుతున్న కార్యక్రమం
  • దక్షిణ నియోజకవర్గంలో నిర్విరామంగా సాగుతున్న పవనన్న ప్రజా బాట
  • మృతురాలి కుటుంబానికి డాక్టర్ కందుల చేయూత

వైజాగ్ సౌత్: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. శుక్రవారం నాటికి ఈ కార్యక్రమం 84వ రోజుకు చేరుకుంది.
కార్యక్రమంలో భాగంగా 39 వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా పెర్రి వీధిలో మృతి చెందిన సీతమ్మ కుటుంబాన్ని ఆదుకున్నారు. ఆర్థికంగా సహాయం అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పారు. వైసిపి పాలన పోవాలి, పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలి అనే నినాదం ప్రజల్లో ఉందన్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికలలో అధికార మార్పు జరగడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఆయన స్ఫూర్తితో తాము ప్రజలకు మంచి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా పట్టిష్టంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జీవీ నారాయణరెడ్డి, పద్మ, లలిత, దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ యువ నాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.