విద్యార్థి రాజేష్ ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయం అందించిన బత్తుల దంపతులు

రాజానగరం: కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన విద్యార్థి బొగ్గు రాజేష్ డిగ్రీ చదువుతూ.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పరీక్ష ఫీజు కట్టలేని పరిస్థితిని తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల రామకృష్ణ వారి సతీమణి శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు ఆ విద్యార్థిని పిలిపించి బాగా చదివి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని సూచిస్తూ పరీక్ష ఫీజు నిమిత్తం 7,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వీరి వెంట మద్దిరెడ్డి బాబులు, దొడ్డి అప్పలరాజు, దేవన దుర్గాప్రసాద్ ఇతర జనసైనికులు పాల్గొన్నారు.