ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి.. పవన్ కళ్యాణ్ పై కాదు: అప్పలరాజు దొర

విజయనగరం జిల్లా: విజయనగరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గిరిజన నాయకుడు, జనసైనికుడు తుమ్మి అప్పలరాజు దొర మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంకులం పర్యటనలో భాగంగా అక్కడ ప్రభుత్వం నిర్మాణం చేసిన ఇల్లులు నాణ్యత లేదని, భూమి కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, లబ్ధిదారులు కష్టాలు తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే లబ్ధిదారులు కష్టాలపై సమస్యలు పరిష్కారం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఇప్పటికైనా విజయనగరం జిల్లాలో ఉన్న జగనన్న కాలనీ భూ కొనుగోలు విషయంపై అవకతవకల్ని పై దృష్టి సారించాలి. ఇల్లుల కేటాయించిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని ప్రభుత్వం కడుతున్న ఇళ్ళ నాణ్యత లోపాలపై అధికారులు దర్యాప్తు చేయాలని.. ఇలాంటి ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరి కాదని మండిపడ్డారు. ఇప్పటికైనా మీ ప్రభుత్వం అధికారులు అవినీతిపై దర్యాప్తు చేయని యెడల. జనసేన అధికారంలో రాగానే అవినీతి పరుల బాగోతాలు బయట తీస్తామని అవినీతిపరులు కటకటాల పంపింస్తామని జనసేన తరపున హెచ్చరించరించడం జరిగింది.. ఇప్పటికైనా వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు పక్కనపెట్టి రాజకీయంగా జనసైనితో తలపడే దమ్ముంటే తలబడాలని హెచ్చరించారు.