పలు కుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చిన బత్తుల

రాజనగరం, సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో రాజనగరం నియోజవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పలు పలకరింపులు, పలు పరామర్శలతో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉమ్మడిశెట్టి పోసియ్య కుమార్తె ఇటీవల కాలంలో మరణించడం జరిగింది. శోకసంద్రంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యం చెప్పి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అలాగే ఉప్పలపాటి కృష్ణ తల్లి అనారోగ్యం గురికావడంతో పలకరించి కొంత ఆర్థిక సహాయం చేశారు. అలాగే కొమ్మన ప్రభు అనారోగ్యం గురికావడంతో వారిని పలకరించి మనోధైర్యం చెప్పి కొంత ఆర్థిక సహాయం చేశారు. గారపాటి శేషయ్య పెరలాల్సిస్ తో బాధపడుతుండగా వారిని పలకరించి జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, మట్ట వెంకటేశ్వరరావు, దాసరి కోటేశ్వరరావు, దాసరి రమేష్, దాసరి గంగారావు, బొబ్బిరెడ్డి సూరిబాబు, ప్రగాఢ శ్రీహరి, మూర్తి, తోట సూర్య మణికంఠ తదితరులు జనసైనికులు.