జనసైనికులు సేవ చేయటంలో ఎప్పుడూ ముందుంటారు ఇతర పార్టీలకు లాగా దోచుకోవటం, దాచుకోవటం చేతకాదు: గాదె

గుంటూరు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలో భాగంగా గురువారం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో తుమ్మల నరసింహారావు, కొండేటి రవి ల ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమం ఏర్పాటు చేయుట జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొని జనసైనికులను కలిసి వారు చేస్తున్న సేవలను కొనియాడారు. గాదె మాట్లాడుతూ… ముందుగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మా పార్టీలో నాయకులు గాని జనసైనికులు గాని ప్రజలకు సేవ చేయటంలో ముందు ఉంటారు అలాగే కష్టాల్లో ఉన్న వాళ్ళకి కుల, మతాలకు సంబంధం లేకుండా వారికి సేవ చేయడంలో ముందుంటారు అని గర్వంగా చెపుతాను. మా నాయకుడు వేసిన బాటలోనే మేము నడుస్తాము అది సేవలో గాని, ప్రజలకు జరుగుతున్న అన్యాయలపై ప్రశ్నించడంలో గాని అని తెలియజేసారు. బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని కలసి అభినందిచడం జరిగింది. రెడ్ క్రాస్ లో బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ని గాదె చేతుల మీదగా ఇవ్వడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, శిఖా బాలు, మధులాల్, కొర్రపాటి నాగేశ్వరరావు, పుల్లారావు లు పాల్గొన్నారు.