అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన బత్తుల

తక్షణ సహాయార్ధం రూపాయలు 5000/- మరియు 25 కేజీల బియ్యం

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, రాపాక పంచాయతీ, శ్రీరామ్ నగరం గ్రామంలో బొట్టు గంగారత్నం ఇల్లు అగ్ని ప్రమాదం వలన పూర్తిగా కాలి బూడిద అయిపోయింది. సీతానగరం మండల జనసేన శ్రేణుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ తక్షణ సహాయార్థం సీతానగరం జనసేన శ్రేణుల చేతుల మీదుగా 5000 రూపాయలు ఆర్థిక సహాయం మరియు 25 కేజీల బియ్యం అందించడం జరిగింది. తొందర్లోనే బాధితులను పరామర్శించడానికి వస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల జనసేన శ్రేణులు మట్ట వెంకటేశ్వరరావు, గోకాడ సూర్యవతి, గడగొట్టి ప్రశాంత్ చౌదరి, శ్రీమంతుల గౌరీ శంకర్, కర్రి సుబ్రహ్మణ్యం, కలగా కృష్ణ చైతన్య, గోకడ సూరిబాబు, బయలపూడి శ్రీను, పొదుపు రవీంద్ర, పిండి వివేక్, చిక్కం నాగేంద్ర, ముచ్చర్ల సాయి, ముచ్చర్ల కపిల్, మారుముఖం శ్రీను, తుటారి రాజేష్, ఆకుల సుబ్బు, వేపుగంటి సత్య తదితరులతో పాటు జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.