అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు అండగా బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, కాపవరం గ్రామంలో మూడు రోజుల క్రితం దళితవాడలో అద్దెకు ఉంటున్న నిరుపేద కుటుంబాలు పూడిగుడిసె అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్దమై సర్వం కోల్పోయిన ముదాపాటి వెంకటలక్ష్మిని, గుండుపల్లి సుశీలని, మొహమాటి శ్రీలక్ష్మిని, మంచాల సామ్యూల్ ని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి ప్రమాదం జరిగిన తీరుని తెలుసుకుని వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేస్తూ బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ కోరుకొండ మండలంలో ఫైర్ స్టేషన్ లేక సకాలంలో ఫైర్ ఇంజన్ రాక చిన్నపాటి ప్రమాదం కాస్త పెను ప్రమాదంగా మారి నిరుపేద కుటుంబాలను రోడ్డుపైకి లాగింది.. ఇదేనా నెంబర్ వన్ నియోజకవర్గం అంటే..? అని ప్రశ్నించారు. వీరి వెంకట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కాపవరం గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.