శ్రీ శ్రీ శ్రీ ముసుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొన్న బత్తుల వెంకటలక్ష్మి

సీతానగరం మండలం, నల్లగొండ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ శ్రీ ముసుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో రాజానగరం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని, అమ్మవారిని దర్శించి, తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కరుణ కటాక్ష ఎల్లపుడు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని జాతరకు విచ్చేసిన భక్తులకు స్వయంగా అన్నవితరణ చేసారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ వారికి 5,000/- రూపాయల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నందే శ్రీనుబాబు, నాగారపు సత్తిబాబు, రుద్రం నాగు, తన్నీరు సురేష్, గట్టి మణిపవన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.