పలు కుటుంబాలను పరమర్శించిన బత్తుల వెంకటలక్ష్మి

సీతానగరం మండలం, మిర్తిపాడు గ్రామానికి చెందిన నల్ల అబ్బులు భార్య నల్ల వరాలమ్మ ఇటీవల స్వర్గస్తులైనారు. గురువారం జరిగిన వరాలమ్మ పెద్దకార్యంలో వారికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి.. అదే గ్రామానికి చెందిన పోలినోళ్ల కిట్టయ్య తల్లి అనంతలక్ష్మి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా.. వారి కుటుంబ సభ్యులను శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మిర్తిపాడు గ్రామం జనసేన నేతలు కిలాడి ఎర్రయ్య, కొర్మదాసు రాజు, కొన్ని చంటి, ఊరుకుర్తి రమేష్, సింగంపల్లి నాని తదితర నేతలు పాల్గొన్నారు.