రోడ్డు ప్రమాదంలో గాయపడిన గణేష్ ను పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాడాల గ్రామానికి చెందిన మట్ట గణేష్ అర్దరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై సాయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారనే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకుని హుటాహుటిన సాయి ఆసుపత్రికి చేరుకుని వారిని పరామర్శించి వైద్య సిబ్బందితో మెరుగైన వైద్య అందించాలని కోరిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు, జనసేన పార్టీ కోరుకొండ మండల నాయకులు, గాడాల జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.