కామిశెట్టి విష్ణుని మర్యాదపూర్వకంగా కలసిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జి బత్తుల బలరామకృష్ణ రాజానగరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ మండల నాయకులను కలవడంలో భాగంగా రాజానగరం మండలం రాజానగరం గ్రామానికి చెందిన కామిశెట్టి విష్ణుని జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జి బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మర్యాదపూర్వకంగా కలసి.. ఆయన యోగ క్షేమాలతో పాటు, పలు విషయాలు – మారుతున్న రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. మీ వంతు సహాయ సహకారాలు మా జనసేన పార్టీకి ఎపుడు ఉండాలని, అవే పార్టీని ప్రజలలో మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి అవసరమవుతాయని ఆయనను కోరారు. ఈ కార్యక్రమంలో మన జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జి బత్తుల బలరామకృష్ణతో పాటుగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు.