తుఫాన్ కారణంగా సర్వం కోల్పోయిన నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం జనసేన పార్టీ ఇన్చార్జి బత్తుల బలరామకృష్ణ కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో మిచౌంగ్ తుఫాను కారణంగా పూర్తిస్థాయిలో దెబ్బతిన్న ఒక నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్నారు. వారికి మాట ఇచ్చిన ప్రకారమే 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలతో పాటు 10,000/- రూపాయల ధన సహాయం చేసి పెద్ద మనసు చూపించారు.