జనసేనలో చేరిన బీసీ సంక్షేమ నేతలు

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, పీఏసీ సభ్యులు అర్హం ఖాన్, పర్యవేక్షణ కమిటీ సభ్యులు దామోదర్ రెడ్డి, సురేష్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం వనపర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్వ సాయి ప్రసాద్ యాదవ్, సదుర్ల వినోద్ కుమార్ బీసీ సంక్షేమ సంఘం వనపర్తి పట్టణ అధ్యక్షుడు, జి శివ కుమార్ వనపర్తి జిల్లా బీసీ నాయకులు జనసేన పార్టీ లో జాయిన్ అయ్యారు.