టెస్ట్ సిరీస్ ఆడబోయే టీమ్ ను ప్రకటించిన BCCI

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. వరుసగా వన్డే , టీ-20 మ్యాచ్ లో పాల్గొన్న టీమిండియా రేపటి(గురువారం) నుంచి టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ మేరకు జట్టు సభ్యులను బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లి(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రుధ్వీ షా, పుజారా, రహనే, హనుమ విహారి, సాహా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, భూమ్రాలను జట్టు సభ్యులుగా తెలిపింది. అలాగే రిజర్వులో గిల్, కేఎస్ రాహుల్, కుల్దీప్ యాదవ్, పంత్, సైనీ, సిరాజ్, జడేజాలు ఉంటారు. మొన్నటి వరకు అస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో వన్డే సిరీస్ ను కోల్పోయిన టీమిండియా, టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే టెస్ట్ సిరీస్ ను కూడా గెలవాలని సిద్ధమవుతోంది.