సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్‌కు ఊరట

సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్‌కు ఊరట లభించింది. కరోనా టెస్టుల అంశంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తమ ఆదేశాలు పాటించలేదని..తెలంగాణ హైకోర్టు హెల్త్ డైరెక్టర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులిచ్చింది. ఈ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బుధవారం వాదనలు విన్న అనంతరం ఈ మేరకు స్టే ఇచ్చింది.