సామాజిక మాధ్యమాల్లో హుందాగా వ్యవహరించాలి: జనసేన పార్టీ మీడియా విభాగం

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసేవారిని జనసేన పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రిని చంపుతానని పోస్టు చేసిన వ్యక్తికి పార్టీతో ఎటువంటి సంబంధం లేదు. హింసను ప్రోత్సహించే, అశాంతిని కలిగించే, అసభ్యకర వ్యాఖ్యానాలు ఉండే పోస్టులను పార్టీ ఎప్పుడూ ఖండిస్తుంది. పార్టీ సానుభూతిపరుడు… పార్టీ అధ్యక్షుల వారి అభిమాని అనే ముసుగులో తప్పుడు పోస్టులు చేసేవారిపట్ల జనసేన నాయకులు, జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం. సామాజిక మాధ్యమాల్లో హుందాగా వ్యవహరించాలని… వాస్తవిక, విశ్లేషణాత్మక దృక్పథంతో, ఆలోచన కలిగించేలా, చైతన్యపరచే విధంగా పోస్టులు ఉండాలని జనసేన పార్టీ అభిలషిస్తుందని జనసేన పార్టీ మీడియా విభాగం తెలిపారు.