రోడ్ల దుస్థితిపై బెల్లంకొండ సాయిబాబు నిరసన

*3 వ రోజు #GoodMorningCMSir

ప్రకాశం, కొమరోలు మండలంలో గిద్దలూరు జనసేన పార్టీ ఇన్చార్జి బెల్లంకొండ సాయిబాబు పర్యటించారు. ఈ సందర్భంగా కొమరోలు మండలంలోని సురవారి పల్లి రోడ్డు మరియు నరసింహుని పల్లి రోడ్డు దుస్థితి పరిశీలించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమంలో భాగంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని పలు రోడ్లను నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలిస్తూ యాచవరం రోడ్డు, పెద్ద కందుకూరు, శంకరాపురం రోడ్డు, జనసేన ఇంచార్జ్ బెల్లంకొండ సాయి బాబా పరిశీలించడం జరిగింది. అనంతరం ప్రభుత్వాన్ని ఈ రోడ్లు త్వరగా మరమ్మత్తులు చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు, మండల నాయకులు, జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ సురేష్ జనసేన కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.