జనం కోసం జనసేన మహాపాదయాత్ర

మూడవ రోజు ఉదృతంగా కొనసాగిన పాదయాత్ర

సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో శుక్రవారం మూడవ రోజు జనం కోసం జనసేన మహాపాదయాత్ర చేపట్టిన యువజన నాయకులు తోట పవన్ కుమార్. ఈ సందర్భంగా తోట పవన్ కుమార్ గారికి హారతులు పట్టిన తీరు చూస్తుంటే కన్నుల పండుగ అనిపించకమానదు. ఓటర్ల మనసు గెలిచేందుకు నిజాయితీయే నా పెట్టుబడి – ఉంటాను ప్రజలకు కట్టుబడి” అనే నినాదంతో బత్తుల బలరామకృష్ణ, వారి నాయకత్వంలో మూడు మండలాలను వారి శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, అల్లుడు తోట పవన్ కుమార్, కుమార్తెలు తోట ప్రత్యూష దేవి, వందనాంబికలు త్రిముఖ వ్యూహంతో మూడవ రోజు మహాపాదయాత్ర కొనసాగించారు.. మహాపాదయాత్రలో భాగంగా సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో ప్రజలు ఇంటిల్లిపాది అడుగడుగునా బ్రహ్మరథం పడుతూ స్వాగతించి తీరుతో బత్తుల విజయం కళ్ళ ముందు ఆవిష్కృతమైంది. పాదయాత్రగా గ్రామంలో ప్రతీ ఇంటికీ, ప్రతీ గడపకూ వెళుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జనసేన పార్టీ సిద్దాంతాలను వివరిస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, పోకెట్ బ్యాడ్జ్, బొట్టు బిల్ల ప్యాకెట్ అందచేశారు.. వృద్ధులు, వీరమహిళలు, జనసేన కార్యకర్తలు, యువత తండోపతండాలుగా స్వచ్ఛందంగా ఈ మహాపాదయాత్రలో పాల్గొన్నారు.