కంటి వైద్య శిబిరంలో బాగంగా కళ్ళజోళ్ళ పంపిణీ

తణుకు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో, తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు ఆర్థిక సహాయంతో డిసెంబర్ 4వ తారీఖున ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడినది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో అర్హులైన వారికి గురువారం విడివాడ రామచంద్ర రావు చేతుల మీదుగా సుమారుగా 150 మందికి ఉచితంగా కళ్ళజోళ్ళు అందజేయడమైనది. ఈ కార్యక్రమంలో తణుకు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చిక్కాల వేణు, వేల్పూర్ జనసైనికులు మెండు రమేష్, కిషోర్, కర్రీ స్వామి, పెన్నాడ గణేష్, జవ్వాది రాజేష్, గుణ్ణం సురేష్, గుణ్ణం సాయి కృష్ణ, విజయ్, మహేష్, గణపతి, మణికంఠ, జవ్వాది ప్రసాదు, పంతం నానాజీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.