ఇఫ్తార్ విందులో పాల్గొన్న బాల్యం రాజేష్

కళ్యాణదుర్గం: రంజాన్ సందర్భంగా గురువారం కళ్యాణదుర్గం టిడిపి పట్టణ అధ్యక్షులు శర్మాస్ వలి ప్రత్యేక ఆహ్వానం మేరకు జనసేన పార్టీ తరఫున ఇఫ్తార్ విందుకు జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ హాజరవడం జరిగింది. ఈ విందుకు హాజరైన వారిలో జిల్లా కార్యదర్శులు లక్ష్మీనరసయ్య, కళ్యాణదుర్గం ముఖ్య నాయకులు గంగరాజు, రుహుల్ల, చిత్తప్ప, దేవా, కళ్యాణదుర్గం మండల ప్రధాన కార్యదర్శులు అనిల్ పాల్యం, చరణ్, మోహన్, సతీష్, రఘు, నియోజకవర్గ జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ రాయుడు ఉన్నారు.