కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన రామ శ్రీనివాస్

రాజంపేట: మాజీ ముఖ్యమంత్రి మరియు రాజంపేట పార్లమెంట్ జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ ఆయనతో మాట్లాడుతూ రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గురించి చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ తెలుగుదేశం వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి మాలేపాటి దామోదర్ నాయుడు, బీసీ నేతలు మంగిరి రమణయ్య, దంతల చెన్నకృష్ణ, పలువురు జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు, స్థానికులు, గ్రామస్థులు వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.