జనసేన ఆధ్వర్యంలో మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామంలో మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. జనసైనికులు మరియుఎమ్ ఆర్ పి ఎఎస్ నాయకులు. జన్మదిన కేక్ కట్ చేసారు. ఈ వేడుకల్లో యెరుబండి చిన్ని మరియు మంద గాంధీ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ “మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి” సంఘ స్థాపకుడు. 14 మంది యువకులతో ప్రారంభమైన దండోరా ఒక చిన్న గ్రామం ఈదుమూడి, ప్రకాశం జిల్లా నుండి మొదలై రాష్ట్రంలో ఉన్న ప్రతి మాదిగ గూడెంలో దండోరా జెండా ఎగిరే విధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా కృషి చేసిన మంద కృష్ణ మాదిగ మనకు ఎంతగానో స్ఫూర్తి దాత అటువంటి వారికీ జనసేన పార్టీ తరుపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపర్చటం చాలా సంతోషంగా భావిస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమములో యెరుబండి చిన్ని, బొంతు సుధాకర్, మంద గాంధీ, మూసూకూడి నారసింహ స్వామి, పెదపూడి ప్రసాద్, గుర్లింక గంగాధర్, యెరుబండి రాజేష్, యెరుబండి చిట్టిరాజా, యెరుబండి రాజీవ్, చుట్టుగూళ్ళ బుజ్జి, పెదపూడి త్రిమూర్తులు, రుద్రా తాతాజి, యెరుబండి మణి, హేమంత్, రామకృష్ణ, శ్యామ్, బంగారం తదితర నాయకులు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.