రెంటపాళ్లలో జనసేన నాయకులతో సమావేశమైన బొర్రా

రెంటపాళ్ళ గ్రామంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు మారిశెట్టి శ్రీనివాసరావు ఇంటికి ఆదివారం సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు వెళ్లి వారి తల్లిదండ్రులను ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని వారిని పలకరించడం జరిగింది. అలాగే గ్రామ జనసేన పార్టీ బలోపేతం గురించి గ్రామ అధ్యక్షుడు శ్రీనివాసరావు, మండల కమిటీ మెంబర్ తీర్థాల నాగేశ్వర లతో జనసేన సీనియర్ నాయకుడు మారిశెట్టి రామ సైదులు, బత్తుల శివ, కట్టి కోట శ్రీనివాసరావు, నంబూరు శ్రీకాంత్, వెంకటేష్ కృష్ణ, చెన్నప్పయ్య, జనసైనికులు కలిసి పార్టీ అభివృద్ధి పరచాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరావు, జిల్లా నాయకులు, చిలకాపూర్ణ మండల మైనార్టీ నాయకులు షేక్ కాసిం, షేక్ రఫీ, షేక్ ఉమర్, మాజీ సర్పంచ్ తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.