మంత్రి పువ్వాడ కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తల దాడి.. మంత్రి క్లారిటీ

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ కాన్వాయ్‌ హైదరాబాద్‌లో హల్ చల్ చేసినట్లు వార్తలు పెద్ద ఎత్తున వచ్చిన విషయం విదితమే. మంత్రికి సంబంధించిన కాన్వాయ్‌లో వచ్చి డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు.. ఆయనకు చెందిన కారుపై దాడి కూడా చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలతో పాటు పలువురికి గాయాలు కూడా అయ్యాయి. అయితే మంగళవారం రోజున ఘటనలపై ఇంతవరకూ స్పందించని మంత్రి.. బుధవారం మధ్యాహ్నం స్పందించి నిన్న అసలేం జరిగింది అనేదానిపై క్లారిటీ ఇచ్చుకున్నారు.

‘హైదరాబాద్‌లోని బాచుపల్లిలో నా మెడికల్ కళాశాలకు వెళ్తుండగా కోరమాల్ దగ్గర బీజేపీ కార్యకర్తలు నా కాన్వయ్‌పై దాడి చేశారని ఆయన మీడియాకు వెల్లడించారు. బిజెపి వాళ్ళు ప్రస్టేషన్ తో నాపై దాడికి దిగారని ఆయన పేర్కొన్నారు. కమలం పువ్వు నేతలకు చెబుతున్నా కారులో డబ్బులు పెట్టి పంచడానికి నేను వెర్రిపువ్వుని కాదు అని అన్నారు. బిజెపి నాపై దాడి చేసిన సమయంలో బిజేపి కార్యకర్తలు దాడికి దిగి కారుపై ఎక్కిన కారు నాది కాదు…..నా కాన్వాయ్ లో అన్నీ ఫార్చూనర్ లే అని ఆయన స్పష్టం చేసారు. బిజెపి కార్యకర్తలు నన్ను చంపటానికి ప్రయత్నించారన్నారు. బిజెపి నాపై చేసిన దాడిని ఈ చికెన్ నారాయణ సమర్దిస్తున్నారా అని మండిపడ్డారు. నేనూ కమ్యూనిస్టు బిడ్డనే ఇటువంటి దాడులకు బెదిరింపులకు భయపడేది లేదు అని స్పష్టం చేసారు.