రక్త దానం చేసిన మల్లెం నాగతేజ

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పార్టీ సిద్ధంతాలకు కట్టుబడి నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి పుంగనూరు నియోజకవర్గం, సదుం మండల అధ్యక్షులు మల్లెం నాగభూషన్ (నాగతేజ), ఎన్నో సార్లు వైసీపీ పార్టీ వాళ్ళు తన మీద దాడి చేసినా.. కేసులు పెట్టినా.. ఆవేశంతో కాకుండా ఆలోచనపురితంగా, వినయం తో పార్టీ సిద్ధంతాలకు అనుగుణంగా పనిచేస్తునటువంటి వ్యక్తి.. తనుకున్నదాంట్లో ఎంతో కొంత తన చుట్టు ఉన్న సమాజానికి ఉపయోగపడుతూ.. పదిమంది దగ్గర మంచి పెరుపెట్టుకున్న నాగతేజ జె.ఎస్.పి సోమవారం అనగా 4-4-2022 న పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు నియోజకవర్గం, తణుకు మండలానికి చెందిన జనసైనికుడి కుటుంబానికి చెందిన పిల్లి సుజాత అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో ఆపరేషన్ నిమిత్తం రక్తం అవసరమని తెలుసుకున్న వెంటనే స్పందించి వారికి తన సహాయాన్ని అందించారు.