కోయిలకొండ గ్రామంలో రక్తదాన శిబిరం

పత్తికొండ నియోజకవర్గం, క్రిష్ణగిరి మండలం, కోయిలకొండ గ్రామంలో జనసేన పార్టీ నాయకులు విజయ్, గోపాల్, శ్రీరాములు, హరికృష్ణ, వారి టీం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సిజి రాజశేఖర్ హాజరయ్యారు. కార్యక్రమం ఉద్దేశించి జనసేన పార్టీ నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా, కోయిలకొండ గ్రామంలో, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు, అలాగే మన కోయిలకొండ గ్రామంలో ఎవరికి రక్తం అవసరమైనా రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి, అలాగే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా.. జనసేన పార్టీని పూర్తిస్థాయిలో బలపేతం చేసి, మన కోయిలకొండ, గ్రామంలో జనసేన పార్టీ గెలుపు కోసం మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *