ఇచ్చాపురం జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ఇచ్చాపురం, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ముందస్తు 51 జన్మదిన సందర్భంగా (ఒడిశా) చికిటి బ్లాక్ రొంప అండ్ బరోడా యూత్ ఆధ్వర్యంలో ప్రాణదాత బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఆంధ్రప్రదేశ్ జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి విచ్చేసారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 43 మంది స్వచ్చందంగా ముందుకొచ్చి రక్తదానం చేసి పలాస ప్రాణదాత బ్లడ్ కి అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, యువత అధికసంఖ్యలో పాల్గొన్నారు.