గురువారెడ్డిని పరామర్శించి మనోధైర్యాన్నిచ్చిన జనసేన నాయకులు

మదనపల్లి ఎమ్మెల్యే వైసీపీ నవాజ్ బాషా తన అనుచరులతో మదనపల్లి మండలం మాలెపాడు గ్రామంలో గ్రామస్తులపై దాడిచేసి ఊరి పెద్దమనిషి గురువారెడ్డి, రాజారెడ్డి కొంతమందిని గాయపరచడం జరిగింది. గాయపడిన గురువారెడ్డిని ఆస్పత్రిలో పరామర్శించి గ్రామస్తులకు ధైర్యం చెప్పిన జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, కార్యదర్శి సనాఉల్ల చెప్పడం జరిగింది.