రక్తదాతలే నిజమైన దేవుళ్ళు

*రక్తదానం చేయండి మానవాళిని, మానవత్వాన్ని కాపాడండి
*అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ

గుంతకల్, అల్లు అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకొని గుంతకల్ పట్టణం గోపి బ్లడ్ బ్యాంక్ సహకారంతో అల్లు అర్జున్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 81 మంది రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మరియు గోపి బ్లడ్ బ్యాంకు అధినేత గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ… అల్లు అర్జున్ అభిమానులు గుంతకల్ పట్టణంలో అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్న తీరు ఎంతో అభినందనీయం అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సృష్టిలో… నా దృష్టిలో…రక్తదాతలు నవజీవన స్ఫూర్తి దాతలు, రక్తదానం చేయండి, చేయించండి మానవాళిని, మానవత్వాన్ని కాపాడండి అని వ్యాఖ్యానించారు. ఈ మెగా రక్తదాన శిబిరం కార్యనిర్వాహకులుగా అల్లు అర్జున్ ఆర్మీ సభ్యులు అల్లు రవి, వెంకీ, హరీష్, నాసిర్, సాయి, జాను, అల్లు సూరి, మధు, అల్లు చోటు, దినేష్, రాష్ట్ర సాయి ధరంతేజ్ యువత అధ్యక్షులు పవర్ శేఖర్, జనసేన నాయకులు పురుషోత్తం, బండి శేఖర్, పాండు కుమార్, ఎస్.కృష్ణ, రామకృష్ణ, మంజు, వంశి, అనిల్, భాష తదితరులు పాల్గొన్నారు.