అక్రమంగా చేపట్టిన గ్రావెల్ తవ్వకాలను పరిశీలించిన బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి: బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని గెలిపిస్తే ఆయన సొంత మండలం పొదలకూరు మండలాన్ని పొదలకూరు టౌన్ కి కూత వేటు దూరంలో ఉన్న కొండని తవ్వేసి రూ.కోట్ల రూపాయల గ్రావెల్ ను అమ్ముకున్నారు. మంత్రి అనుచరుడు ఇంత అవినీతి, ఆక్రమాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గానీ, జిల్లా యంత్రాంగం గాని, ప్రభుత్వ అధికారులు గాని ఎవరు కూడా పట్టించుకోనటువంటి పరిస్థితులు. ఒక అవకాశం ఇస్తే కొండను దొబ్బేశారు. ప్రజలందరూ కూడా ఆలోచించి గుర్తుపెట్టుకోవాలి. ఇంత అవినీతి జరుగుతుంటే మరి మంత్రికి తెలుసో లేదో మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం. ఇంత అవినీతికి పాల్పడిన వారిపైన మీరు కఠిన చర్యలు తీసుకుంటారా లేదా. ఈ కొండలను మింగేసిన వాళ్ళపై చర్యలు తీసుకునేంతవరకు జనసేన తరుపున మా పోరాటం ఆగదు. ప్రకృతి వనరులను మీ ఇష్టానుసారంగా దోచుకుపోతుంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయ్యుండి నిమ్మకు నీరెత్తినట్లు వున్నారంటే దీనికి కారణం ఇందులో మీకు కూడా ఏమైనా భాగస్వామ్యం ఉన్నదేమో అన్న అనుమానాలు మాకు వస్తున్నాయి. మీరు చర్యలు తీసుకుంటారా లేదా చర్యలు తీసుకునేంతవరకు జనసేన పార్టీ మాత్రం పోరాటం చేస్తుంది. ఈ కార్యక్రమంలో సుధాకర్, గంటా పవన్, వెంకయ్య, శ్రీహరి, శ్రీకాంత్, జగదీష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.