సాయి ప్రకాష్ కుటుంబానికి బొలిశెట్టి ఆర్థిక సాయం

తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంకు చెందిన సాయి ప్రకాష్ 24 సంవత్సరాల యువకుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల పురుగుల మందు తాగి హాస్పటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడని బొలిశెట్టి శ్రీనివాస్ గారికి చెప్పుకుంటే మా బాధ తీరుస్తాడని ఉద్దేశంతో ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి బొలిశెట్టి శ్రీను దగ్గరికి వచ్చి సమస్యను వివరిస్తే
బొలిశెట్టి శ్రీను వెంటనే స్పందించి 15వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి, విజయవాడ వెళ్లడానికి ఆసుపత్రి సిబ్బందితో అంబులెన్స్ మాట్లాడి పంపించారు.