జనసేన జగ్గు బాయ్ అండ్ కో స్టికర్ల విడుదల

జనసేన జగ్గు బాయ్ అండ్ కో.. స్టికర్లను శనివారం మదనపల్లి జనసేన ఆధ్వర్యంలో విడుదలచేసి ఈ స్టిక్కర్లను ఆటోలకి అదే విధంగా బస్సులకు అంటించడం జరిగింది. ఈ స్టికర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ప్రభుత్వ పాలనలో నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్ర అభివృద్ధికి అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవి చేయకపోగా కనీసం మౌలిక సదుపాయాలు కల్పించని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అలాగే జూన్ నెలలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయాత్ర మొదలుపెట్టిన నాటి నుండి నేటి విశాఖ పర్యటన వరకు రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ వైఫల్యాలు గురించి ఎన్నో విషయాలు వచ్చినప్పటికీ వాటన్నిటికీ ఒకే సమాధానం పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్లిళ్లు, దత్తపుత్రుడు ఈ యొక్క సమాధానం మాత్రమే ప్రభుత్వం వైపు నుండి వినిపిస్తుంది. అది కూడా ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వకపోగా ప్రభుత్వంలోని ఇతరులు తమ ఇష్టం వచ్చినట్టు ప్రెస్మీట్లు పెట్టి సమాధానం ఇవ్వటం అనేది యావత్ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తొందరలోనే వైసీపీకి సరైన బుద్ధి చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దర్గించడం ఖాయం ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా శనివారం విడుదల చేసి వాహనాలకు అంటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మదనపల్లి సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్ జనసేనాని టీం అధ్యక్షులు గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, టీం సభ్యులు పాల్గున, రాజు, జనసేన మదనపల్లి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా యూత్ వింగ్ నాయకులు ఆయాజ్, హర్ష, నాగేంద్ర, సోను, గణేష్, ధరణి, భాష, నరేష్, జాఫర్, సాయి, బాలాజీ, నాగరాజు, నరేష్ కుమార్ రెడ్డి, అరవింద్, రేవంత్, తదితరులు పాల్గొని హలో ఏపీ బై బై వైసిపి హలో జగ్గు భాయ్ బాయ్ జగ్గు భాయ్ జై జనసేన జై జై జనసేన అను నినాదాలతో వాహనాలకు స్టిక్కర్లు అంటించడం జరిగింది.