గాయపడిన జనసైనికునికి ఇన్సూరెన్స్ అందజేసిన బొలిశెట్టి శ్రీనివాస్

పెంటపాడు మండలం అల్లంపురం గ్రామ జనసైనికుడు బలగం జానకి రామ్ నాగ చందుకి విద్యుత్ షాక్ వల్ల చేతికి గాయం అవ్వడం జరిగింది. జనసేన పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ నుంచి 50000 రూపాయలు జనసేన పార్టీ నుంచి తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ మరియు వారి తనయులు శ్రీ బొలిశెట్టి రాజేష్ చేతుల మీద చెక్ ని జనసైనికుడికి అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.