ఈతకోట తాతాజీని మర్యాదపూర్వకంగా కలిసిన బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన-తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అసెంబ్లీ సీటు బొలిశెట్టి శ్రీనివాస్ కి కేటాయించినందుకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ ఈతకోట తాతాజీని మర్యాదపూర్వకంగా వారి ఇంటి వద్దకు వెళ్లి జనసేన-తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమిని నియోజకవర్గంలో బలపరిచి మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఉమ్మడి పొత్తుని గెలిపించే దిశగా అడుగులు వేద్దాం అని బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.