జనసేనాని జన్మదిన సంబరాలలో బొలియశెట్టి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 52వ జన్మదిన శుభ సందర్భంగా వివిధ నియోజకవర్గాలలో భారీ ఎత్తున జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, జిల్లా కార్యవర్గం, హాజరయ్యారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆగస్టు 31 నుండీ అధినేత జన్మదిన సంబరాలు ఘనంగా మొదలై నందిగామ నియోజకవర్గంలో నందిగామ, కంచికచర్ల, చంద్రర్లపాడు, విరాలపాడు మండలాల్లో, తిరువూరు నియోజకవర్గంలో గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట, ఏ కొండూరు మండలాల్లో మరియు జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెనుగ్రంచి ప్రోలు, జగ్గయ్యపేట మండలంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో అన్నదాన కార్యక్రమాలు, రక్తదానం కార్యక్రమాలు, రెల్లి కులస్తులకు అన్నదానం, వస్త్ర దానం, హాస్టల్ పిల్లలకు బుక్స్ పంపిణీ చేసి నిజమైన జనసేన కార్యకర్తలు నిరూపించుకున్నారు అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం శ్రీనివాసరావు, చింతల లక్ష్మీ, బడిసా మురళికృష్ణ, నియోజకవర్గ నాయకులు రమాదేవి, మండల నాయకులు, గ్రామ నాయకులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.