ఆత్మకూరు రైతుల దీక్ష కు మద్దతు తెలిపిన నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు నియోజకవర్గం: చేజర్ల మండలం, పెల్లేరు గ్రామానికి చెందిన దళిత రైతులు గత 22 రోజులుగా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదురుగా దీక్ష చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. మంగళవారం ఆ దీక్షకు మద్దతుగా ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. దీక్షలో పాల్గొన్న ఆత్మకూరు ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ మరియు జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేసి తదుపరి విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వంశీ, చంద్ర,భాను, అనిల్, హరీష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.