జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్రా జోన్ కో – కన్వీనర్ గా బొళియశెట్టి శ్రీకాంత్

కొండపల్లి: జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్రా జోన్ కో – కన్వీనర్ గా కొండపల్లికి చెందిన జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు బొళియశెట్టి శ్రీకాంత్ నియమితులయ్యారు. రాష్ట్రంలో జోన్ కమిటీలను జనసేనాని పవన్ కళ్యాణ్ శనివారం ప్రకటించారు. ఇందులో కన్వీనర్లు, కో – కన్వీనర్లు, కమిటీ సభ్యులు ఉన్నారు. సెంట్రల్ ఆంధ్రా జోన్ కమిటీలో శ్రీకాంత్ కు చోటు దక్కింది. జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడిగా, వారాహి మీడియా కో – ఆర్డినేటర్ గా పార్టీ బలోపేతానికి, పలు సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి ఆపన్నహస్తం అందించిన శ్రీకాంత్ సేవలను గుర్తించిన పవన్ కళ్యాణ్ కో – కన్వీనర్ గా నియమించారు. తనను కో – కన్వీనర్ గా నియమించిన మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి పార్టీ పెద్దలకు శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు.