శివసేనలో చేరిన బాలీవుడ్‌ నటి ఊర్మిళ మాటోండ్కర్

బాలీవుడ్‌ నటి, రంగీలా భామ ఊర్మిళ మాటోండ్కర్‌ (46) మంగళవారం శివసేనలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి,శివసేన అధ్యక్షుడు, ఉద్ధవ్‌ ఠాక్రే సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఊర్మిళను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలంటూ ఇప్పటికే గవర్నర్‌ కోశ్యారీకి సిఫారసు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 2019 సంవత్సరంలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై ముంబై నార్త్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తరువాత ఊర్మిళ సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌ నుంచి పార్టీ నుంచి తప్పుకున్నారు.  ఊర్మిళ శివసేనలో చేరిన వెంటనే తోటినటి కంగనా రనౌత్‌పై విమర్శలు చేశారు. కంగనా రనౌత్‌కు అనవసరంగా ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నామన్నారు.