రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద ఘటనలో చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా హైదరాబాద్లోని తాడ్బండ్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని చెందిన వ్యక్తులు.
కుటుంబమంతా ఇనోవా వాహనంలో కర్నాటక రాష్ట్రంలోని గుర్మిత్కల్కు తెల్లవారుజామున బయల్దేరింది. చేవెళ్ల మండలంలోని కందవాడ స్టేజి దాటిన తర్వాత రోడ్డు మలుపులో వీరు ప్రయాణిస్తున్న కారు.. ముందు ఉన్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి.. ఎదురుగా వస్తున్న బోర్వెల్ లారీని ఢీకొంది. ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఆరుగురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు.గాయపడినవారిన ఆస్పత్రికి తరలించారు.ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జయింది. దీంతో మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. మృతుల వివరాలు: ఆసిఫ్ఖాన్(50) సానియా(18) నజియా బేగం(45) హర్ష(28) నజియా భాను(36) హర్షభాను(6)